Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఐపీ సంస్కృతి వద్దంటారు ప్రధాని మోదీ.. నేను వస్తే రావాలని తెలీదా తంతాను అంటారు మంత్రి.. ఇదేమి న్యాయం

దేశంలో వీఐపీ సంస్కృతి వద్దేవద్దు. ఆడంబరాలు, పటాటోపాలు ప్రదర్శించవద్దు అంటూ ఒకవైపు ప్రధాని మోదీ స్పష్టమైన ప్రాతిపదిక వేసుకుని పాలనలో నిజమైన సంస్కరణల కోసం పాటుపడుతున్నారు. మరోవైపు తమ ప్రొటోకాల్‌ విషయంలో ఏ కొంచెం తేడా వచ్చినా సహించమంటున్నారు రాష్ట్రస్థా

Webdunia
గురువారం, 25 మే 2017 (08:47 IST)
దేశంలో వీఐపీ సంస్కృతి వద్దేవద్దు. ఆడంబరాలు, పటాటోపాలు ప్రదర్శించవద్దు అంటూ ఒకవైపు ప్రధాని మోదీ స్పష్టమైన ప్రాతిపదిక వేసుకుని పాలనలో నిజమైన సంస్కరణల కోసం పాటుపడుతున్నారు. మరోవైపు తమ ప్రొటోకాల్‌ విషయంలో ఏ కొంచెం తేడా వచ్చినా సహించమంటున్నారు రాష్ట్రస్థాయి మంత్రులు. మంత్రివర్గ విస్తరణలో ఎలాగోలా సీటు దక్కించుకున్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి చంద్రమోహన్‌రెడ్డికి పోలీసులంటే అందులోనూ సీఐ స్థాయి అధికారులంటే లెక్కే లేనట్లు తెలుస్తోంది. 
 
మంత్రి స్థాయిలో నెల్లూరుకు తాను వస్తే వచ్చి కలవాలని తెలీదా, ఒళ్లు బలిసిందా..తంతాను అంటూ నెల్లూ రు నాలుగో టౌన్‌ సీఐ సీతా రామయ్యపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిందులేశారు. తానేం తప్పు చేశానని కొడతారు ఇదేం బాగా లేదని మంత్రిని సీఐ నిలదీశారు. ఈ వ్యవహారంపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహించడంతో సీఐని వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో పూలు, పండ్ల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం కోసం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో తన పరిధిలోని ఒక ప్రాంతంలో గొడవ జరుగుతోందని ఎస్పీ విశాల్‌గున్నీకి సమాచారం అందింది.  ఎస్పీ ఆదేశం మేరకు ఇద్దరు ఎస్‌ఐలను డ్యూటీలో ఉంచి సీఐ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
 
ఈలోపు మార్కెట్‌కు వచ్చిన మంత్రి సోమిరెడ్డి ఎస్‌ఐలను చూసి మంత్రి వస్తే సీఐ రావాలని తెలీదా మీకేం బలిసిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మంత్రి ఆగ్రహించిన విషయాన్ని ఎస్‌ఐలు సీఐకి చేరవేశారు. సీఐ సీతారామయ్య వెంటనే కూరగాయల మార్కెట్‌ వద్దకు వచ్చి కార్యక్రమం ముగిశాక మంత్రికి కనిపించారు. సీఐని చూడటంతోనే సోమిరెడ్డి ఆయన మీద మండి పడుతూ మంత్రి వస్తే రావాలని తెలీదా బలిసిందా నిన్ను తంతాను అని దుర్భాషలాడారని సమాచారం.
 
ఈ సంఘటనతో తీవ్ర ఆవేదన చెందిన సీఐ సీతారామయ్య తానేం తప్పు చేశానని తంతారని, మర్యాదగా మాట్లాడాలని ఎదురు తిరిగారు. మంత్రి తనను దూషించారని సీఐ అదే రోజు జిల్లా ఎస్పీకి, ఐజీకి ఫిర్యాదు చేశారు. ప్రజల ముందు సీఐ తనకు ఎదురు తిరిగారని, అతడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి గుంటూరు ఐజీ సంజయ్‌ మీద ఒత్తిడి తెచ్చారని తెలిసింది. మంత్రి ఒత్తిడి మేరకు సీతారామయ్యను వీఆర్‌కు పంపుతూ బుధవారం రాత్రి ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే. ఒక సీఐ ఎస్పీ ఆదేశాన్ని మన్నించి డ్యూటీకి వెళ్లాలా... లేక మంత్రి ముందు హాజరు వేయించుకోవాలా? తాను పంపితేనే సీఐ డ్యూటీకి వెళ్లాడని ఎస్పీ చెప్పరు? నిజాయితీగా డ్యూటీ నిర్వర్తించిన సీఐని మంత్రి శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ఈ మొత్తం ఘటన సుపరిపాలనలో భాగంగానే జరిగిందా.. అధికారులు తమ ఇళ్లముందు పాలేర్లు అనుకుంటేనే కదా బలిసిందా... తంతాను వంటి పదప్రయోగాలు వచ్చేది. 
 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments