Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారి గొయ్యి వారే తవ్వుకున్నారు...! మంత్రి రావెల

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (06:15 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్‌లు ఫోన్ ట్యాపింగ్ అంశంలో వారి గొయ్యి వారే తవ్వుకున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. 
 
గురువారం ఆయన మట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని కేసీఆర్‌కు భయం ఆవహించిందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదని జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికతో జగన్‌లోనూ, కేసీఆర్‌లోనూ భయం నెలకొందని తెలిపారు. 
 
కుట్ర ఫలితంగా జగన్, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందన్నారు. జగన్, కేసీఆర్ తమ గొయ్యి తామే తవ్వుకున్నారని రావెల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments