Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు: మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (19:03 IST)
నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో చిరు ధాన్యాల ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని పోచారం చెప్పారు. మార్చి 1వ తేదీ వరకు చిరుధాన్యాల ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. నగరాల్లో వీటి వినియోగాన్ని పెంచటంతో రైతులు పండించిన చిరుధాన్యాల పంటకు తగిన ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
 
ఇక ముందు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పోచారం పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాధాన్యాలపై 60 స్టాళ్లు ఏర్పాటు అయ్యాయని ఆయన తెలిపారు. 
 
చిరుధాన్యాల (మిల్లెట్) సాగును ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అలవాటు చేసేందుకు వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ హోంసైన్స్ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments