Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఓ మంచి ముహూర్తాన విశాఖ నుంచి పాలన : మంత్రి అమర్నాథ్

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (10:07 IST)
ఓ మంచి ముహూర్తాన త్వరలోనే విశాఖపట్టణం నుంచి రాష్ట్ర పాలన ప్రారంభమవుతుందని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదిస్తామని తెలిపారు. పైగా, రాష్ట్రంలో మూడు రాజధానులకు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. మూడు రాజధానులకు అందరి మద్దతు ఉందని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేశారని చెప్పారు. 
 
ఇకపోతే రాష్ట్రంలో ఏ సమస్య ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పాదయాత్ర పేటెంట్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిదేనని, యాత్రల ద్వారా వారు ప్రజల్లో భరోసా నింపారని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments