Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో ఉన్నాం, కానీ లాభాల బాటలోకి తెస్తాం, మంత్రి అవంతి

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (23:05 IST)
రాయలసీమ జిల్లాల్లో టూరిజంను మరింత అభివృద్థి చేస్తామన్నారు పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. 
 
కరోనా కారణంగా టూరిజం నష్టాల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవమేనన్నారు. 130 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే టూరిజం శాఖ ప్రస్తుతం 60 కోట్ల ఆదాయంకు చేరుకుందన్నారు. పర్యాటక శాఖ సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడంతోనే కష్టసమయంలో కూడా ఆదాయాన్ని సంపాదించగలిగామని చెప్పారు. 
 
పర్యాటక ప్రాంతాలకు సందర్సకుల తాకిడి క్రమేపీ పెరుగుతోందని..ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లోని పర్యాటకులనే కాకుండా కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటలకును ప్రత్యేక ప్యాకేజీలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. విమానాల్లో తిరుపతి విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులకు టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తోందన్నారు. 
 
తిరుపతిలో త్వరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టార్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే నూతనంగా మరో 26బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంను టూరిజం శాఖకు టిటిడి అప్పగించనుందని.. పర్యాటక శాఖ పద్మావతి నిలయంను తీసుకున్న తరువాత పర్యాటకులకు గదుల కేటాయింపు జరుగుతుందని మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments