Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో ఉన్నాం, కానీ లాభాల బాటలోకి తెస్తాం, మంత్రి అవంతి

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (23:05 IST)
రాయలసీమ జిల్లాల్లో టూరిజంను మరింత అభివృద్థి చేస్తామన్నారు పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. 
 
కరోనా కారణంగా టూరిజం నష్టాల్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవమేనన్నారు. 130 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే టూరిజం శాఖ ప్రస్తుతం 60 కోట్ల ఆదాయంకు చేరుకుందన్నారు. పర్యాటక శాఖ సిబ్బంది కలిసికట్టుగా పనిచేయడంతోనే కష్టసమయంలో కూడా ఆదాయాన్ని సంపాదించగలిగామని చెప్పారు. 
 
పర్యాటక ప్రాంతాలకు సందర్సకుల తాకిడి క్రమేపీ పెరుగుతోందని..ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లోని పర్యాటకులనే కాకుండా కర్ణాటక, చెన్నై రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటలకును ప్రత్యేక ప్యాకేజీలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. విమానాల్లో తిరుపతి విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులకు టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తోందన్నారు. 
 
తిరుపతిలో త్వరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టార్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే నూతనంగా మరో 26బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తిరుచానూరులోని పద్మావతి నిలయంను టూరిజం శాఖకు టిటిడి అప్పగించనుందని.. పర్యాటక శాఖ పద్మావతి నిలయంను తీసుకున్న తరువాత పర్యాటకులకు గదుల కేటాయింపు జరుగుతుందని మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments