Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలటరీ శిక్షణ

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:32 IST)
నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి.
 
సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాల్పుల శిక్షణ జరగనుంది. రోజుకు రెండు పర్యాయాలకు పైగా కాల్పుల శిక్షణ ఉంటుంది. 6 నుంచి 8 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొననున్నాయి. 
 
శిక్షణ జరిగే సూర్యలంక చుట్టు పక్కల 100 కిలో మీటర్ల వరకూ ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments