Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి క్షమించు, తిరుమలకు మందుబాటిళ్ళు, మాంసం ఎలా తీసుకెళుతున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (14:10 IST)
అతనో ప్రముఖ మీడియా ఛానల్ కెమెరామెన్.. తిరుపతి, తిరుమలలో కెమెరామన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పదిమందికి మంచి చెప్పాల్సిన ఆ కెమెరామెన్ నిషేధిత వస్తువులను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా ఎక్కడో కాదు సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలకు. 
 
గత నాలుగురోజుల నుంచి తిరుపతికి చెందిన మీడియా ఛానల్ కెమెరామెన్ వ్యక్తి విధులు నిమిత్తం తిరుమలకు వెళుతున్నట్లు ప్రతిరోజు కారులో వెళుతూ ఉండేవాడు. అనుమానం వచ్చిన టిటిడి సెక్యూరిటీ అధికారులు అతడిని, కారును చెక్ చేశారు. అయితే కారులో నిషేధిత వస్తువులు ఉండటాన్ని గుర్తించారు. 
 
కారు వెనుక సీటు కింద 10 ఫుల్లు బాటిళ్ళు, 10 కిలోలపైన చికెన్ కనిపించాయి. కారు సీటు వెనుక ఏ విధంగా అనుమానం రాకుండా వీటిని జాగ్రత్తపరిచాడు. అయితే టిటిడి విజిలెన్స్ అధికారులు కారు మొత్తాన్ని పరిశీలించగా అందులో మద్యం, మాంసం కనిపించాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను అధిక రేట్లకు విక్రయించిన కేసులో కూడా ఇదే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. మీడియా ప్రతినిధిగా ఉన్న వ్యక్తే ఇలా చేయడంపై చర్చ నడుస్తోంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments