Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే మాజీ ఈవో... మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత

మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (10:02 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా సోమవారమే పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. 
 
మాజీ ప్రధానమంత్రి నరసింహారావుకు మీడియా సలహాదారునిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ 'అసలేం జరిగిందంటే' పేరిట యధార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాయగా, అది సంచలనం సృష్టించింది. ఇంకా 'కర్త అతడే', 'తిరుమల చరితామృతం', 'తిరుమల లీలామృతం'.. వంటి పుస్తకాలు కూడా రాశారు. 
 
పీవీఆర్‌కే ప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments