Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు చిత్ర హింసలు... విముక్తి కల్పించిన ఐసీడీఎస్

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (15:52 IST)
ఆభం శుభం తెలియని చిన్నారిని తల్లిదండ్రులు సాకలేక ఒ కుటుంబానికి అప్పగించగా ఇంటి యజమానులు బాలికకు నరకయాతన చూపిన హృదయ విదారక సంఘటన మేడ్చల్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని రాజరాజేశ్వరి అపార్టుమెంట్లో ఓ ఇంట్లో బాలికను తల్లిదండ్రులు రూ.10 వేలకు అప్పగించారు. ఆ ఇంటి యజమానులు చిన్నారి అని కూడా కనికరం చూపకుండా తీవ్రంగా గాయపరిచి వెట్టి చాకిరి చేయిస్తు హింసించారు. అది గమనించిన స్థానికులు ఐసీడీఎస్, బాలల హక్కుల సంఘం నేతలకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంటికి ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి ఆ ఇంటికి వెళ్లి బాలికకు విముక్తి కల్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments