Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం : యశోద వైద్యులు

Webdunia
శనివారం, 26 జులై 2014 (15:18 IST)
మెదక్ రైలు ప్రమాదంలో గాయపడిన నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెదక్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 9 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా, నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన వైద్యులు వరుణ్, ప్రశాంత్, వైష్ణవి, తరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, శరత్, శ్రావణి, శిరీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
 
అభినంద్, శివకుమార్, సందీప్, నితూష వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మిగిలిన తొమ్మిది మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వారిని సాయంత్రం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్లు వారు తెలియజేశారు. సాయిరాం, రుచిత, సాత్విక, హరీష్, మహిపాల్‌రెడ్డి, సద్భావన్‌దాస్, దర్శన్, కరుణాకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వివరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments