Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : ఎండి.జానీ పాషా

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (20:01 IST)
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (రి.నెం:138/2020)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం అంతా కరోనా మహమ్మారి వలన విలవిల లాడుతూ ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న సందర్భంలో, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరిన నాటి నుండి కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కోవిడ్ వాక్సిన్ అందించే కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నిమగ్నమైవున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే నూతన వ్యవస్థలో రక రకాల పనులతో తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటూ ప్రజలకు వ్యాక్సిన్ అందించే క్రమంలో, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం ఆ ఎన్నికల్లో సైతం సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తూ ఎన్నికల విధులు నిర్వహించవలసి వుంది.
 
ఈ సమయంలో ఉద్యోగులు కరోనా బారిన మరియు ఇటీవల శరవేగంగా విజృంభిస్తున్న స్ట్రైన్ వైరస్ బారిన కానీ పడే అవకాశం పుష్కలంగా వుంది. ఒకవేళ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. అయినా ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం చిరు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమేమని, అసలే ప్రొబేషన్ పీరియడ్‌లో వున్న తమకు జరగరాని సంఘటనలు జరిగితే తమ కుటుంబాలు అన్యాయమవుతాయని ఈ సందర్బంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్‌తో నిడిమోరుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments