Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల భారీ చోరీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:16 IST)
గుంటూరు జిల్లాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మంగళగిరి- గుంటూరు జాతీయ రహదారిపై రూ.80 లక్షల విలువైన మొబైల్‌ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు కంటైనర్‌లో వెళ్తున్న మొబైల్‌ ఫోన్లను దుండగులు దొంగిలించారు. 980 ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన విషయాన్ని తొలుత కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్లు గమనించలేదు.

వెనుక వస్తున్న ఓ వాహనదారుడు కంటైనర్‌ను ఆపి వెనుక డోరు తెరుచుకుందని డ్రైవర్‌కు తెలపడంతో మొబైల్‌ఫోన్ల చోరీ జరిగినట్లు గుర్తించారు.

దీంతో మంగళగిరి సమీపంలోని కాజ టోల్‌గేట్ వద్ద కంటైనర్‌ను డ్రైవర్‌ ఆపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, ఇతర బృందాలతో గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments