చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో షార్ట్ షర్య్కూట్తో దుకాణాలు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ మంత్రులు పి.నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు తెలిపారు.
శ్రీకాళహస్తిలోని భిక్షాల గోపురాన్ని ఆనుకుని ఉన్న దుకాణంలో అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి 24కు షాపులు దగ్ధమైన విషయం తెలిసిందే. కాలి బూడిదైన షాపులను మంత్రులు శుక్రవారం పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రమాదంపై తీవ్ర ఆవేదనను వ్యక్తంచేశారు. బాధితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.