Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయం సహాయక సంఘాలకు మాస్కుల తయారీ పని

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:08 IST)
మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు.

క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు.

ఆర్టీకే కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments