Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు రోజుల్లో పెళ్లి, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)
మరో ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యా యత్నం చేసారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం సొంపాలెం గ్రామంలో 24 ఏళ్ల యువతికి మరో 7 రోజుల్లో వివాహం జరుగనుంది. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిద్రిస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
మంటలు చెలరేగడంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి మంటలను ఆర్పారు. ఐతే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మదనపల్లి మండలంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments