Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు రోజుల్లో పెళ్లి, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)
మరో ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యా యత్నం చేసారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం సొంపాలెం గ్రామంలో 24 ఏళ్ల యువతికి మరో 7 రోజుల్లో వివాహం జరుగనుంది. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిద్రిస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
మంటలు చెలరేగడంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి మంటలను ఆర్పారు. ఐతే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మదనపల్లి మండలంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments