Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు రోజుల్లో పెళ్లి, నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)
మరో ఏడు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యా యత్నం చేసారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం సొంపాలెం గ్రామంలో 24 ఏళ్ల యువతికి మరో 7 రోజుల్లో వివాహం జరుగనుంది. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నిద్రిస్తుండగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
 
మంటలు చెలరేగడంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి మంటలను ఆర్పారు. ఐతే అప్పటికే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మదనపల్లి మండలంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా మరేదైనా కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments