Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్‌ నరసింహన్‌ను తొలగించండి .. రాజ్‌నాథ్‌కు మర్రి శశిధర్ రెడ్డి లేఖ

Webdunia
శనివారం, 4 జులై 2015 (16:40 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను తక్షణం తొలగించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు టీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి శనివారం ఓ లేఖ రాశారు. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ రాజ్యాంగబద్దంగా తన విధులను నిర్వర్తించలేదని మర్రి ఆ లేఖలో పేర్కొన్నారు.
 
సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోగా, ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 2(1) అంశాన్ని గవర్నర్ ఉల్లంఘించారని వివరించారు. సభ్యుడు కానటువంటి వ్యక్తిని ఆరు నెలలకుమించి కొనసాగించడం రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని కేంద్రం దృష్టికితీసుకెళ్లారు. 
 
ఈ నేపథ్యంలో తలసానిని వెంటనే తొలగించేలా గవర్నర్‌ను కేంద్రం ఆదేశించాలని లేఖలో కోరారు. తలసాని విషయంలో ప్రభుత్వానిదే తప్పని మొదట అనుకున్నానని, కానీ మొత్తం ఎపిసోడ్‌లో గవర్నర్‌దే బాధ్యత అని తెలుస్తోందన్నారు. దాంతో పార్టీ ఫిరాయింపులను గవర్నర్ చర్య ప్రోత్సహించినట్లయిందన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments