Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల వార్నింగ్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపారు. బాక్సైట్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని,  ఈ చర్యలను తక్షణం ఆపాలంటూ మావోలు రాసిన లేఖలో హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, లేట్ రైట్ మైనింగ్ ముసుగుల బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తక్షణం నిలుపుదల చేయాలని, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 
 
తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మావోలు హెచ్చరించారు. గతంలో సివేరి సోమ, కిడారి సర్వేశ్వర రావుల తరహాలోనే ప్రజా కోర్టులో ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments