మూడు రాజధానుల ముచ్చటేనా? అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఇదమిత్థంగా సమాధానం చెప్పడం లేదు. శాసన రాజధానిగా ఉంటుందని మాత్రమే చెబుతోంది. కేవలం శాసనసభ సమావేశాలకు వేదిక అయితే.. ఏడాదిలో గరిష్టంగా 50-60 రోజులపాటు అధికారిక కార్యకలాపాలుంటాయి. అదీ ప్రభుత్వం ఏడాదిలో అన్ని సెషన్లూ అమరావతిలో జరపాలనుకుంటేనే! 
 
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించారు. వాటి భవిష్యతేంటి? వాటిని ఏం చేయబోతున్నారో సూచనప్రాయంగానైనా చెప్పలేదు. 'శాసన రాజధాని'కే పరిమితమైతే.. ఒక భవనం సరిపోతుంది. శాసనసభ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు ఇప్పటికే భవనాలున్నాయి. 
 
నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలు, అధికారిక బంగ్లాలు, అతిథి గృహాలు, ఉద్యోగుల అపార్ట్‌మెంట్‌ టవర్లు ఏమవుతాయి? రహదారులు, వారధుల వంటి ఇతర మౌలిక వసతుల పరిస్థితేంటి? ఏడాదికిపైగా నిర్వహణ లేక తుప్పలు మొలుస్తున్న ఆ నిర్మాణాలన్నీ కాలగర్భంలో కలసిపోవడమేనా? 
 
రాజధాని ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్‌, పైప్‌లైన్ల వంటి పనులకు వెచ్చించిన రూ.10వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథాయేనా? రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల భూముల పరిస్థితేంటి? వారికి సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాల సంగతేంటి? ఇవన్నీ రాజధాని ప్రజలతోపాటు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారిని మదిని తొలుస్తున్న ప్రశ్నలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments