Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ప‌లువురు విరాళం

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:34 IST)
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్నదాన ప‌థ‌కానికి ప‌లువురు దాత‌లు శ‌నివారం విరాళాలు అందించారు. విజ‌య‌వాడ స‌మీపంలోని పెన‌మ‌లూరుకు చెందిన కిలారు వెంకయ్య చౌదరి రూ.1,01,116లు విరాళం ప్ర‌క‌టించారు.

కిలారు సబర్మతీ భాయి, బలరామారావు పేరున‌ అన్నదానం జ‌ర‌పాల‌ని పేర్కొంటూ విరాళం చెక్కును ఆలయ అధికారులకు అందించారు. అదేవిధంగా మ‌రొక దాత విజ‌య‌వాడ టిక్కిల్‌రోడ్డులో నివాసం ఉంటున్న మేకా విధ్యాధరి, డాక్ట‌ర్ ఎం.వై.నాయుడు నిత్యాన్న‌దానం నిమిత్తం రూ.1,01,116లు దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి చెక్కును ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబును కలిసి అంద‌జేశారు.

అలాగే విజ‌య‌వాడ‌లోని విద్యాధ‌ర‌పురం కామ‌కోటిన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఇంకొక దాత ‌చిట్టి రామకృష్ణ రూ.1,01,116లు విరాళాన్ని ఆయ‌న ధర్మపత్ని వెంకటదుర్గా శేషుకుమారి పేరున నిత్యాన్న‌దానం నిమిత్తం దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి చెక్కు అందజేశారు.

అనంత‌రం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం క‌ల్పించి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments