Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల అంత పాపం చేసి పుడుతోందా: మనీషా ఆవేదన

స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (03:11 IST)
స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా తన జన్మ విషయంలో కూడా తమ తాత అలాగే బాధపడ్డారని తెలిపి విచారం వ్యక్తం చేశారు. 
 
‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు.
 
భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments