Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌క్క‌నే ఉన్నార‌ని ప‌వ‌న్ తో స్టేజీపై మాట్లాడ లేదు...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (12:39 IST)
తాము ఎంతో నిజాయితీగా మా ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ ప్రకాష్ రాజ్ సి.సి.ఫుటేజ్ తీసుకున్నా ఉపయోగం లేద‌ని, తాము నిజాయితీగానే గెలిచాం అని విష్ణు వివ‌రించారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయక ముందే నాదే గెలుపని ప్రకాష్ రాజ్ నాతో కరచాలనం చేశార‌ని, ఆయ‌న ఏం చేశారో సిసి ఫుటేజ్ లో నిక్షిప్తం అయి ఉంద‌ని విష్ణు చెప్పారు. పృథ్వీ ఆరు ఓట్లతో ఓడిపోవడంతో తాను బాధపడ్డాను అని అన్నారు. చిరంజీవి త‌మ‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, మా నాన్న మోహ‌న్ బాబుతో చిరంజీవి మాట్లాడార‌న్నారు. అలాగే అలై బ‌లైలో పవన్ కళ్యాణ్ తో స్టేజ్ కింద మాట్లాడాన‌ని, ఉప రాష్ట్రపతి ఉండడం వల్ల స్టేజ్ పై మాట్లాడుకోలేద‌ని మంచు విష్ణు వివ‌ర‌ణ ఇచ్చారు. 
 
పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలని ఈయనెవరో తెలుసా అంటూ ట్వీట్ చేశాన‌ని, అలాగే, 
వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు అని తెలిపారు. మా అసోసియేషన్ లో జర్నలిస్టు కొండేటి సురేష్ ఉన్నార‌ని, జర్నలిస్టు నటుడు ఎలా అవుతాడ‌ని విష్ణు ప్ర‌శ్నించారు. నటులే మా అసోసియేషన్ సభ్యులుగా ఉండాలని బైలాస్ ను తీసుకొస్తామ‌ని మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments