Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లల్లోనే వుండిపొమ్మంటే.. జనాలు గుంపుగా అష్టా చెమ్మా, పేకాట, క్యారంబోర్డులు ఆడుతూ గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా సులభంగా వ్యాపిస్తోంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి కరోనాను అంటించింది. తాజాగా విజయవాడలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మరికొంత మందికి అంటించాడు.
 
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో ఓ లారీ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. అతడు ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వచ్చిన వెంటనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో పేకాడిన వారికీ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

ప్రయోగాత్మక చిత్రం రా రాజా వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments