Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లల్లోనే వుండిపొమ్మంటే.. జనాలు గుంపుగా అష్టా చెమ్మా, పేకాట, క్యారంబోర్డులు ఆడుతూ గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా సులభంగా వ్యాపిస్తోంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి కరోనాను అంటించింది. తాజాగా విజయవాడలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మరికొంత మందికి అంటించాడు.
 
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో ఓ లారీ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. అతడు ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వచ్చిన వెంటనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో పేకాడిన వారికీ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments