అత్తపై అల్లుడి అత్యాచారం.. కన్నేసి మాయమాటలు చెప్పి.. రాత్రిపూట?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (11:11 IST)
అత్తపైన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. పిల్లనిచ్చిందనే కనికరం లేకుండా అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అల్లుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో అతడి అన్యాయానికి బలైపోయింది 
 
వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ కందికల్ బస్తీకి చెందిన ఓ మహిళ(45) తన కూతురిని బాలాపూర్ చౌరస్తాలో ఉండే భాస్కర్(28) అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. భాస్కర్ ఆర్టీసీ అద్దె బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పిల్లనిచ్చిన అత్తపైనే కన్నేసిన భాస్కర్ బుధవారం రాత్రి బయట పని ఉందని చెప్పి ఆమెను బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. బాలాపూర్ రోడ్డులోని గుర్రం చెరువు కట్టపైకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాధితురాలిని ఇంటి వద్ద దించేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ కూతురిని వదిలేస్తానని బెదిరించాడు. అయితే అత్త చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments