Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపి.. తానూ తనువు చాలించిన భర్త

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (10:44 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగా మారిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా వేముల మండలం నల్లచెరవుపల్లిలో రామాంజనేయులు అతని భార్య కవిత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ వచ్చారు. కొంతకాలంగా కవితపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం పీకల వరకు మద్యం సేవించి వచ్చిన ఆయన... తెల్లవారుజామున ఆమెను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. 
 
అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments