Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి ఇంటికి భార్య వెళ్లిందనీ సజీవదహనమైన భర్త.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 మే 2016 (17:16 IST)
ప్రకాశం జిల్లా తాళ్ళూరులో దారుణం జరిగింది. వద్దని చెపుతున్నా తన భార్య ఆమె సోదరుని ఇంటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాళ్లూరులోని ఎస్సీ కాలనీకి చెందిన ముంతా చిన అంజయ్య (29) గ్రామంలోని రాముల వారి మేడ వద్ద కుట్టు మిషన్‌పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన అంజయ్య భార్య లలిత. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లలిత తన తమ్ముడు పెళ్లికి పొదిలి మండలం గంజిపాలెం వెళ్లింది. పెళ్లి ముగించుకుని ఇంటికి రాకుండా తమ్ముడు నివాసముండే జబల్‌పూర్‌కు వెళుతున్నట్లు భర్తకు సమాచారం చేరవేసింది. దీనికి అతను వద్దని చెప్పాడు. అయితే, బంధువులంతా పట్టుబట్టడంతో ఆమె వెళ్లకతప్పలేదు.
 
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అంజయ్య... తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద కిరోసిన్‌ వంటిపై పోసుకుని నిప్పంటించున్నాడు. చుట్టుపక్కలవారు మంటలను చల్లార్చే ప్రయత్నం చేసిపన్పటికి శరీరం అధికభాగం కాలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వి.మహేష్‌ సంఘటనా స్థలాన్ని చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments