Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు.. వెంకయ్య హాజరు...

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:03 IST)
భారత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌ బాబు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మల్లిమస్తాన్‌ బాబును కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వీరిలో కేంద్ర మంత్రి కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిషోర్‌, పి.నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలు మల్లి మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. 
 
అంతకుముందు మస్తాన్ బాబు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. మస్తాన్ బాబు అమర్‌ రహే అంటూ అంతిమయాత్రలో పాల్గొన్న హితులు, స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. అనంతరం గాంధీజనసంగంలోని అతని పొలంలోనే.... సాహసవీరుడు శాశ్వాత నిద్ర తీసుకున్నాడు. అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments