Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలోకి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి.. టీడీపీలోకి వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఫిరాయింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (12:30 IST)
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఫిరాయింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
తెరాసలో తన చేరికను ఎంపీ మల్లారెడ్డి ఖరారు చేశారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యమయ్యేందుకు తెరాసలో చేరుతున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో అనుచరులతో ఎంపీ మల్లారెడ్డి సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మల్లారెడ్డి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. 
 
బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరనునున్నట్లు వెల్లడించారు. తెరాస ప్రభుత్వ పథకాలు తనను ఆకర్షించాయని, తెరాసలో చేరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మరింత కృషి చేయనున్నట్లు చెప్పారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ మంచి పథకాలన్నారు. ఎపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మంచి విజన్‌ ఉన్న నేతలని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
 
మరోవైపు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి బుధవారం తెదేపాలో చేరనున్నారు. ఉదయం గిద్దలూరు నుంచి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి విజయవాడ బయల్దేరారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అశోక్‌రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments