నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:12 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయ మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈనెల 19వతేదీ వరకు జరిగే ఉత్సవాలకు భోళాశంకరుడికి పరమభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది.

ఇందుకోసం మధ్యాహ్నం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని ఆలయ సమీపంలోని భక్తకన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళతారు. మూడు గంటల ప్రాంతంలో ధ్వజారోహణం నిర్వహించి వైభవంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.

అనంతరం స్థానిక ధూర్జటి కళాప్రాంగణంలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలను ప్రముఖ సినీగాయని పి.సుశీల జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. తర్వాత ప్రముఖుల ఉపన్యాసం, ప్రముఖ కళాకారుల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భిక్షాల గాలిగోపురం, సమాచారకేంద్రం కూడలి, పెండ్లిమండపం, భేరివారి మండపం ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు.

కాగా.. మదనపల్లెకు చెందిన జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ రాటకొండ గురుప్రసాద్‌ దంపతులు శుక్రవారం స్వామికి పట్టువస్త్రాలు కానుకగా సమర్పించారు. 
 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తదితరులు ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈవో పెద్దిరాజు, అర్చకులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments