Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిఠాయి అడిగిందనీ కుమార్తెను కొట్టి చంపిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:00 IST)
మహారాష్ట్రలోని గోండియా జిల్లా లోనారా గ్రామంలో దారుణం జరిగింది. మిఠాయి అడిగిందన్న కోపంతో ఓ తండ్రి కన్నబిడ్డను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20 నెలల వైష్ణవి అనే కుమార్తె ఉంది. ఈ  చిన్నారి స్వీటు ఇప్పించమని మారాం చేసింది. దీంతో ఐదు రూపాయలు ఇవ్వాలని భర్తను భార్య కోరింది. 
 
స్వీటు కోసం కుమార్తె ఏడుస్తుండటంతో వివేక్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పైగా, తన కుమార్తెను తీసుకొని ఆమెను తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు. అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు. 
 
తీవ్రగాయాల పాలైన వైష్ణవిని టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments