Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిఠాయి అడిగిందనీ కుమార్తెను కొట్టి చంపిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:00 IST)
మహారాష్ట్రలోని గోండియా జిల్లా లోనారా గ్రామంలో దారుణం జరిగింది. మిఠాయి అడిగిందన్న కోపంతో ఓ తండ్రి కన్నబిడ్డను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20 నెలల వైష్ణవి అనే కుమార్తె ఉంది. ఈ  చిన్నారి స్వీటు ఇప్పించమని మారాం చేసింది. దీంతో ఐదు రూపాయలు ఇవ్వాలని భర్తను భార్య కోరింది. 
 
స్వీటు కోసం కుమార్తె ఏడుస్తుండటంతో వివేక్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. పైగా, తన కుమార్తెను తీసుకొని ఆమెను తలుపు, ఇంటి మెట్ల మీద కొట్టాడు. అడ్డుకోబోయిన తనపై కూడా దాడి చేయగా, తాను పారిపోయానని భార్య వర్షా చెప్పారు. 
 
తీవ్రగాయాల పాలైన వైష్ణవిని టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments