Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కార్మికులు, రోజువారీ కూలీల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం, వారికి ఉపాధి లేకపోవడమే. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇసుక కంటికి కనిపించకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది భార్యాపిల్లలను పోషించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. 
 
దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments