Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కార్మికులు, రోజువారీ కూలీల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం, వారికి ఉపాధి లేకపోవడమే. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇసుక కంటికి కనిపించకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది భార్యాపిల్లలను పోషించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. 
 
దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments