Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (12:00 IST)
వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.
 
ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్కే జీనత్‌తో పరిచయం ఏర్పడింది. జీనత్‌కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో పెళ్లాడింది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. అయినా వినయ్‌కు జీనత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వచ్చారు. అయితే శనివారం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. ఇద్దరూ రైలు ముందు నిల్చుని ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments