Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలసి బతకలేమనుకున్న.. ఆ జంట పురుగుల మందు తాగి..!

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:47 IST)
కలసి బతకలేమనుకున్న ఆ జంట కనీసం కలిసైనా చనిపోవాలనుకుంది. అందుకే సమీపంలోని పొలాల్లోకి వెళ్లి తమతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాచర్లకు చెందిన మక్కెన శ్రీనివాసరావు, బాపట్ల మండలం జుమ్మలపాలెంకు చెందిన యువతి ఝాన్సీలు చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 
 
శ్రీనివాసరావు జుమ్మలపాలెంలో లైన్ మెన్‌గా పనిచేస్తున్న సమయంలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు సహజీవనం కూడా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం సమస్య వచ్చిందో ఏమో! తన బైక్‌పై మాచర్ల సరిహద్దుల్లోని పొలాల్లోకి వచ్చి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి వద్ద రెండు లేఖలు లభించాయి. వీటిల్లో ఒకటి అతని తల్లికి, మరొకటి సోదరికి రాసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments