Webdunia - Bharat's app for daily news and videos

Install App

విహహేతర సంబంధం... ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి.. మరొకరు ఆస్పత్రిలో.. అనాథలైన పిల్లలు

వివాహేతర సంబంధం ఇద్దరు ప్రేమికులను ఆత్మహత్యకు పురికొల్పింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Webdunia
బుధవారం, 27 జులై 2016 (11:31 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రేమికులను ఆత్మహత్యకు పురికొల్పింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ మహిళ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మకరాంపురం గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
వివరాల్లోకి వెళ్తే.... మకరాంపురం గ్రామానికి చెందిన వజ్జ రమేష్(30), అదే గ్రామానికి చెందిన ఎలుసూరి స్రవంతి మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్న కంకర గోతులు వద్ద గల జీడితోటలో మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో రమేష్ ప్రాణాలు కోల్పోయూడు. అంతకు ముందు ప్రియురాలు స్రవంతి సోంపేట సీఐ సూరినాయుడు, కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ వద్ద వాంగ్మూలం ఇచ్చింది.
 
స్రవంతి మాటల్లో... తనకు ప్రియుడు రమేష్‌తో 16 ఏళ్ల కిందట నుంచి ప్రేమ సాగుతోందని, పదేళ్ల కిందట తనకిష్టం లేకపోయినా మేనమామతో వివాహం చేశారని చెప్పింది. తర్వాత ప్రియుడు రమేష్ సిలగాం గ్రామానికి చెందిన గాయిత్రిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. తనకు కూడా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపింది. 
 
అయితే, ఇటీవల కాలంలో ప్రేమికులమైన తాము తరచూ కలుస్తూ ఉండేవాళ్లమని చెప్పింది. రెండు నెలల కిందట గ్రామానికి చెందిన దేవాలయంలో రమేష్‌తో రహస్యంగా మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది.
 
మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో అందరూ నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డామని చెప్పింది. ఇదిలావుండగా రమేష్ మృతి చెందడంతో భార్య గాయిత్రి, మూడేళ్ల కుమారుడు అనాథలుగా మిగిలారు. 
 
మరోవైపు చావుబతుకుల్లో ఉన్న స్రవంతిని చూసి భర్త, ముగ్గురు పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కాగా మృతుని సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మృతదేహానికి సోంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.  

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments