Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాచర్లలో ప్రేమజంట ఆత్మహత్య... కారణం అదే...

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (09:08 IST)
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శనివారం నాడు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... మాచర్లకు చెందిన 30 ఏళ్ల మక్కెన శ్రీనివాసరావు బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా ఉన్నాడు. వినుకొండలోని కొండ్రముట్ల గ్రామానికి చెందిన శశిరేఖ అనే మహిళను వివాహం చేసుకుని, గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్య శుక్రవారంనాడే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments