Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి వివాహేతర సంబంధం.. ఆపై...

పెళ్లికాని యువకుడితో ముగ్గురు బిడ్డల తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు వారి బలవన్మరణాలకు కారణమైంది. కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 17 జులై 2017 (11:47 IST)
పెళ్లికాని యువకుడితో ముగ్గురు బిడ్డల తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు వారి బలవన్మరణాలకు కారణమైంది. కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేశుల గ్రామానికి చెందిన రాజోలు నాగార్జున రెడ్డి (26) అనే యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. ఈయన ఇటీవలే సౌదీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఇంటివద్దే తాపీపని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అదే మండలం కొమ్ములూరు గ్రామానికి చెందిన అమర్‌నాధ్‌ రెడ్డి భార్య లక్ష్మీపార్వతి (33) అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో శనివారం లక్ష్మీపార్వతి, నాగార్జున రెడ్డి తిరుపతికి వచ్చి, దైవదర్శనం చేసుకుని తిరిగి ఊరికి వెళుతూ.. రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో తలలు ఛిద్రమైపోయాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, లక్ష్మీపార్వతి ముగ్గురు పిల్లల తల్లి కావడంతో ఇపుడు ఆ పిల్లలంతా తల్లిలేని బిడ్డలయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments