Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజ్రాతో ప్రేమ.. సహజీవనం.. చివరకు డబ్బు కోసం గొంతుకోశాడు...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (10:10 IST)
హిజ్రాను ప్రేమించి మూడేళ్ళుగా సహజీవనం చేస్తూ వచ్చిన ఓ యువకుడు అదనపు కట్నం కోసం హిజ్రా గొంతుకోశాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పాలమూరు జిల్లా గార్ల మండలం అంజనాపురానికి చెందిన బానోత్‌ రాధిక (హిజ్రా), ఇదే మండలం కొత్తతండాకు చెందిన దారావత్‌ సురేశ్‌ పట్టణంలోని హన్మంతరావు నగర్‌ కాలనీలో రాధిక అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.
 
కాగా, సురేశ్‌ ఇప్పటికే రాధిక వద్ద కట్నం పేరుతో రూ.2 లక్షలు తీసుకున్నాడు. తాజాగా అదనపు కట్నం కోసం వేధిస్తూ వచ్చాడు. రైళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన డబ్బులు ఎక్కడ దాచి పెడుతున్నావంటూ రాధికను సురేశ్‌ పలుమార్లు వేధించాడు. ఈ విషయం తెలిసిన సహచర హిజ్రాలు వారి ఇంటికొచ్చి సయోధ్య కుదిర్చారు.
 
ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి అదనపు కట్నం విషయమై వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అపుడు ఆగ్రహానికి లోనైన సురేశ్‌.. కత్తితో రాధిక గొంతుకోసి పరారయ్యాడు. రాధికను ఆస్పత్రికి తరలించి, సురేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments