Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ముసుగులో మోసం.. పదేళ్ల ప్రేమ.. ఆపై సహజీవనం.. నిన్ను పెళ్లి చేసుకోననని మెసేజ్..

ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ పేరిట వంచించడం.. కట్నం కోసం వేధించడం ఎక్కువైపోయింది. తాజాగా పదేళ్ల పాటు ప్రేమ.. ఆపై సహజీవనం చేసిన జంట విడిపోయింది

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:23 IST)
ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ పేరిట వంచించడం.. కట్నం కోసం వేధించడం ఎక్కువైపోయింది. తాజాగా పదేళ్ల పాటు ప్రేమ.. ఆపై సహజీవనం చేసిన జంట విడిపోయింది. ఇందుకు కారణం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి పదేళ్లు గుంటూరులో చదువుకుంది. 
 
ఆమెకు ఆ ప్రాంతానికి చెందిన పాపయ్య అలియాస్‌ డేవిడ్‌ పరిచయయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఇద్దరూ కలిసి నగరంలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా పెళ్లికి ముహూర్తం ఖరారు కాకున్నా.. వివాహం కోసం మూడు లక్షల నగదు, ఐదు తులాల బంగారం పెడతామని అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పారు. అయితే పది రోజుల నుంచి పాపయ్య కనిపించకుండా పోయాడు. 
 
ఇంతలో యువతి ఫోనుకు గురువారం ఓ మెసేజ్ వచ్చింది. నిన్ను పెళ్లి చేసుకోనని.. నన్ను మర్చిపో అంటూ పాపయ్య సందేశం ఇచ్చాడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న పాపయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments