Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి.. వేరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.. ప్రియుడు ఏం చేశాడంటే?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (14:10 IST)
ఎంతోకాలంగా ప్రేమించిన యువతి మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. ఇది భరించలేని ఓ భగ్న ప్రేమికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
 
మార్టూరు మండలంలోని రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్‌ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. అయితే, పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని బాలిక భర్త వదిలి కిశోర్ ఇంటికి వచ్చేసింది.
 
దీంతో ఆమె భర్త తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చి తిప్పి పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, కిశోర్‌ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments