Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి అంగీకరించలేదనీ రైలు కిందపడిన డిగ్రీ - ఇంటర్ విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (12:19 IST)
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్‌ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్‌ చదువుతోంది. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.  ఈ విషయాన్ని తమ కుటుంబ పెద్దలకు చెప్పారు. కానీ, వారు వారిద్దరి పెళ్లికి సమ్మతించలేదు.
 
దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ ప్రేమజంట.. ఒకరినొకకరు వేరుపడి జీవించలేక చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈపరిస్థితుల్లో శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments