Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు సోమవారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసారు. ఈ ఎంపికలో కోట్లకొద్ది ధనం పెట్టి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు. మద్యం షాపుల లాటరీలో లక్కీగా నంద్యాల దివంగత మాజీ ఎంపి, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె ఏకంగా 10కి పైగా షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, పీలేరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఆమె ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ స్థాయిలో ఒక్కరినే ఇలా అదృష్టం వరించడం చర్చనీయాంశమవుతోంది.
 
మరోవైపు రాష్ట్రమంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్లతో 100 దరఖాస్తులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తుల్లో ముగ్గురిని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద పూర్తి వివరాలు బయటకు వస్తే.. ఇంకా ఎంతమంది అదృష్టవంతులను ఈ మద్యం షాపులు వరించాయో తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments