Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీది పచ్చిమోసం... ఏరు దాటాక తెప్ప తగలేయడమే : జేపీ

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (16:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరిపై పచ్చి మోసం, దగా అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అని పునరుద్ఘాటించారు. అయితే, బీజేపీ వ్యవహారశైలి చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. 
 
'తెలుగు భవిత-సంకల్ప దీక్ష' పేరిట తాను చేపట్టిన నిరసన దీక్షల్లో భాగంగా మంగళవారం అనంతపురం సప్తగిరి కూడలిలో ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర ఆర్థిక లోటును కేంద్రమే పూరించాలని డిమాండ్ చేశారు. 
 
హామీలు నెరవేర్చకుంటే ఏపీ భవిష్యత్ అంధకారంగా మారుతుందని చెప్పారు. లక్షలాదిమంది యువత నిరుద్యోగులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక లోటు భర్తీ, పరిశ్రమల స్థాపన నెరవేర్చాలని జయప్రకాష్ నారాయణ్ కోరారు. 

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

Show comments