Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బల్లి బిర్యాని.. బాబోయ్

విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వె

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (23:05 IST)
విజయవాడ టీచర్స్ కాలనీ సిల్వర్ స్పూన్ హోటల్ నిర్వాకం ఇద్దరి ప్రాణాలు మీదకి తెచ్చింది. ఇద్దరు స్నేహితులు హోటల్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది వేడి వేడిగా తీసుకువచ్చి వడ్డించారు. కొద్దిగా తిన్న తర్వాత అందులో బల్లి కనిపించింది. వెంటనే ఆ ఇద్దరూ వికారంతో వాంతులు చేసుకున్నారు. 
 
అస్వస్థతకు గురయిన ఇద్దరిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్లి బిర్యానీ వడ్డించిన హోటల్‌పై ఇతర వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు వచ్చేలోపే హోటల్ సిబ్బంది బిర్యానీ మొత్తాన్ని బయటపారేశారు. పుడ్ ఇన్‌స్పెక్టర్ హోటల్‌కు వచ్చి వంటకాలు జరుపుతున్న గదులను పరిశీలించారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు అధికారుల గుర్తించారు. అనంతరం హోటల్‌ను సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments