Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు... దిష్టితీసిన సతీమణి భువనేశ్వరి

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (09:14 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై మంగళవారం సాయంత్రం విడుదలైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత విజయవాడ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్.. దాదాపు 14.30 గంటల నిర్వరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అయితే, గత 53 రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీరసంగా ఉన్న ఆయన... మరోమారు సుధీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయారు. 
 
అలాగే, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకోగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నివాసానికి రైతులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకోవడం గమనార్హం. 
 
ఇంటికి వచ్చిన చంద్రబాబుకు ఆయన భార్య నారా భువనేశ్వరి దిష్టితీసిన టెంకాయను పగులగొట్టారు. అలాగే, ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments