Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా?..చంద్రబాబు అగ్రహం

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (15:15 IST)
గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చెలామణి అవుతున్నారని అన్నారు.

ప్రజలంతా అవినీతిపరులని తానొక్కడే నీతివంతుడినని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుని ప్రజలకు శిక్షగా మారుస్తున్నారని. చిన్నాన్నని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎందుకని అగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments