Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరప విత్తన బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెడతాం: మంత్రి కురసాల కన్నబాబు

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:53 IST)
మిరప రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడిం చారు. అవసరం మేరకు ఆర్ బి కేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

కరోనా ఉదృతిని సాకుగా చూపి  కొంత మంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రాచుర్యం కలిగిన ప్రీమియం, హై బ్రీడ్ రకం విత్తనాలను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించే  వ్యాపారులు, డిలర్లపై కటిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

త్వరలో ఈ రకమైన ప్రాచుర్యం పొందిన విత్తనాలను ఆర్  బి  కె ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు  తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం అధిక ధరలకు అమ్ముతున్న కొన్ని రకాల  విత్తనాలా కోసం ఎదురు చూడకుండా అదే సెగ్మెంట్ లో అధిక దిగుబడిని ఇచ్చే ఇతర విత్తనాలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు  మంత్రి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments