Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు : బీజేపీ నేత లంక దినకర్

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:48 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ దమ్మున్న నేత అని బీజేపీ నేత లంక దినకర్ అభిప్రాయపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్‌‍ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దినకర్ స్పందించారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. 
 
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో మాఫియా దురాగతాలకు అడ్డుకట్ట పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు.
 
పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం అందించారని, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం తీసుకువచ్చారని వివరించారు. కొవిడ్ సమయంలో పేదల ఆకలిని తీర్చడం కోసం రెట్టింపు బియ్యం అందిస్తే... కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు తరలిపోయిందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments