Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మంత్రుల మధ్య ల్యాండ్ వార్ : చంద్రబాబు చెంతకు చేరిన పంచాయతీ

విశాఖపట్టణం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చెలరేగిన ల్యాండ్ వార్ ముదిరిపాకానపడింది. ఫలితంగా ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ భూకుంభకోణం వెనుక నువ్వున్న

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (11:36 IST)
విశాఖపట్టణం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చెలరేగిన ల్యాండ్ వార్ ముదిరిపాకానపడింది. ఫలితంగా ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ భూకుంభకోణం వెనుక నువ్వున్నావంటే నువవ్వున్నావని.. మంత్రులు గంటా శ్రీనివాస్, సీహెచ్. అయ్యన్నపాత్రుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఇది పెద్ద వివాదాస్పదమైంది. కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నం భూ స్కామ్‌లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని మంత్రి అయ్యన్న ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా మంత్రికి లేఖాస్త్రం సంధించారు మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు.
 
గంటా శ్రీనివాస రావు రాసిన లేఖలో భూ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జ్‌ లేదా... సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టకు అయ్యన్న నష్టం కలిగించారని గంటా తన లేఖలో ఆరోపించారు. గతంలోనూ అయ్యన్న వల్లే పార్టీకి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదనే విచారణ కోరినట్లు లేఖలో పేర్కొన్న గంటా.. తనపై ఎలాంటి దర్యాప్తు జరిపినా ఆహ్వానిస్తానన్నారు. 
 
ఇదిలావుండగా, ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. మంత్రులు గంటా, అయ్యన్న వివాదంపై సుమారు గంటపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై భేటీలో నిశితంగా చర్చించనున్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక, నంద్యాల ఉప ఎన్నికపై చర్చ జరగనుంది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments