బుల్లితెర నటి శ్రీవాణి రౌడీలా ప్రవర్తిస్తోంది... కట్టడి చేయండి : ఓ మహిళ ఫిర్యాదు
బుల్లితెర నటి శ్రీవాణిపై పరిగికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవాణి రౌడీలా ప్రవర్తిస్తూ తమపై దౌర్జన్యం చేస్తోందని, ఆమెను కట్టడి చేయాలంటూ అందులో బాధిత మహిళ పేర్కొంది. ఈ వివరాలను పరిశీలి
బుల్లితెర నటి శ్రీవాణిపై పరిగికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవాణి రౌడీలా ప్రవర్తిస్తూ తమపై దౌర్జన్యం చేస్తోందని, ఆమెను కట్టడి చేయాలంటూ అందులో బాధిత మహిళ పేర్కొంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె సోదరి శ్రీకన్య మరికొందరితో కలిసి సోమవారం పరిగికి వచ్చారు. పరిగికి చెందిన అనూష ఇంటికి వెళ్లి ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరే వారికి విక్రయించేందుకు సదరు స్థలం చూపించారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి రావడంతో గొడవ జరిగింది. అయితే, శ్రీవాణి హైదరాబాద్ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువచ్చి తనపై దాడి చేశారని అనూష పరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనూష ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై అనూష దాడికి యత్నించిందని శ్రీవాణి సైతం అనూషపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను ఉంటున్న ఇంటి స్థలానికి శ్రీవాణికి ఎలాంటి సంబంధంలేదని అనూష పేర్కొనగా.. తమ తండ్రి పరిగి గ్రామస్తుడని, ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.