Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:27 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, సినీ నటి పూనంకౌర్‌లు సోషల్ మీడియాలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
 
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్నారని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ పనిలో మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక అపార్ట్‌‌మెంట్‌లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాయడానికి కారణం నిందితులను పట్టుకుంటే గానీ తెలియదని చెప్పారు. డబ్బు కోసం చేసారా లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి పని చేసారా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments