Webdunia - Bharat's app for daily news and videos

Install App

నొప్పించివుంటే క్షమించండి : లగడపాటి భీష్మ ప్రతిజ్ఞ

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:17 IST)
ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో సర్వేలు చేయబోనని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు అక్షర సత్యాలయ్యాయి. దీంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల నాడిని తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానంటూ పేర్కొన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రజానాడిని పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలమైనందుకు, భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 
 
తన సర్వేల వల్ల ఎవరైనా, ఏ పార్టీ అయినా బాధపడి ఉన్నట్లయితే మన్నించగలరు అని విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌కు లగడపాటి రాజగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి 2019లో సర్వేల సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా, తనకు ఏ ఒక్క పార్టీతో అనుబంధం లేదని స్పష్టం చేశారు. పైగా, సర్వేలు చేయడం తనకు ఓ వ్యాపకం అని చెప్పారు. అందువల్ల పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నించానని, కానీ, గత రెండు సర్వేలు తప్పు అయినందువల్ల తాను ఇకపై సర్వేలు చేయబోనని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments